Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : అశోక్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ విద్యార్థి సేన క్రికెట్ టోర్నమెంట్ *రెండవ రోజు ప్రారంభించిన అశోక్ నాయక్ *విద్యతో పాటు విజ్ఞానాన్ని, సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. *సేవాలాల్ విద్యార్థి సేన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వంకుడోత్ అశోక్ నాయక్ కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతిని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ బంజారా విద్యార్థులు, సేవాలాల్ సేన క్రికెట్ టోర్నమెంట్ మరియు అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా ప్రారంభించిన యూనివర్సిటీఅశోక్ నాయక్ . కాకతీయ యూనివర్సిటీ బంజారా గిరిజన విద్యార్థులందరూ విద్యతో పాటు శారీరక దృఢత్వం, వ్యాయామ విద్య ఆటలతో సోదర భావాన్ని పెంపొందించి సేవాలాల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బంజారా విద్యార్థి పాటుపడాలని వీసి ఆకాంక్షించారు. ఇంత ఘనంగా కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని క్రీడలను ఏర్పాటు చేయడంలో బంజారా విద్యార్థుల ఉత్సాహాన్ని కొనియాడారు. గిరిజన విద్యార్థులతో పాటు యూనివర్సిటీలో చదువుతున్న వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు ఈ సేవాలాల్ టోర్నమెంట్లో పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలని, విద్యతో పాటు విజ్ఞానాన్ని, సోదర భావాన్ని పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ దాదాపు 32 విభాగాలను చెందిన విద్యార్థులు, గిరిజన సంఘం నాయకులు, సేవాలాల్ సేన ఇతర వర్గాల విద్యార్థులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని కాకతీయ యూనివర్సిటీ బంజారా విద్యార్థులు ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని చాలా ఉత్సాహంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న సంగతి యావత్ రాష్ట్ర బంజారా యువకులకు ఎంతో ఆదర్శవంతంగా ఉంటుందని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని క్రీడా పోటీలను చాలా ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీ బంజారా విద్యార్థులను ముఖ్యంగా అశోక్ నాయక్ ను అతని మిత్రులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్. రమేష్ నాయక్ ,లైబ్రరీ ఇంచార్జ్ జవహర్, ప్రొఫెసర్ ఈసం నారాయణ ,హన్మకొండ సేవాలాల్ సేన అధ్యక్షుడు మురళి నాయక్ మరియు సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పవన్ నాయక్, శ్రీను,వెంకన్న, సచిన్, శ్రీకాంత్,అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News