Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ సంగారెడ్డి, డిసెంబర్ 28, నివాస్ న్యూస్: సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిర్మలాజగ్గారెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశ నిర్మాణంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేసి యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. యువత ఈ కుట్రలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, సిడిసి సభ్యులు రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల అధ్యక్షులు సిద్ధన్న, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్, బుచ్చి రాములు, నర్సింహారెడ్డి, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, బల్వంత్ రెడ్డి, అనిల్, చారి తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News