Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమంలో పాల్గొన్న* *కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్* శేర్లింగంపల్లి నివాస్ న్యూస్ జనవరి 5 కొండాపూర్ డివిజన్, మార్తాండ్ నగర్ కాలనీలో, సిద్ది వినాయక మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో, కవిటి లక్ష్మి, శ్యామ్ దంపతులు ఏర్పాటు చేసిన, సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరయ్యారు. పలువురు మహిళలు వేసిన రకరకాల రంగుల వల్లుల ముగ్గులను కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. కమిటీ వారితో కలసి విజేతను నిర్ణయించారు. ఈ సందర్బంగా ముగ్గులు పోటీలో గెలిచిన పలువురు మహిళలకు కార్పొరేటర్ హమీద్ పటేల్ చేతులు మీదుగా బహుమతులు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి ఏర్పాట్లు చేసిన శ్రీ సిద్ది వినాయక మహిళా కమిటీ వారికీ, కవిటి లక్ష్మి, శ్యామ్ దంపతులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ అభినందనలు తెలియజేశారు. ముగ్గులు పోటీలో మొదటి మూడు బహుమతులు గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేసి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, కవిటి లక్ష్మి, శ్యామ్, రవి రెడ్డి, గోవింద్, కవిత, భవాని, కౌస్యల, సువర్ణ, శాంతి, ప్రశాంతి, వరలక్ష్మి, సుజాత, అక్షయ, శృతి, భార్గవి, సంతోషి, మౌనిక పలువురు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News