Sunday, 26 July 2026 05:34:54 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*బ్రాండెడ్ సీసాల్లో చీప్ లిక్కర్.. సగం ధరకే ఖరీదైన మద్యం*

Date : 08 January 2026 06:23 PM Views : 167

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *బ్రాండెడ్ సీసాల్లో చీప్ లిక్కర్.. సగం ధరకే ఖరీదైన మద్యం* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 8 హైదరాబాద్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ ఐదుగురు నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువైన మద్యం స్వాధీనం ఖరీదైన బాటిళ్లలోని మద్యాన్ని తీసి కల్తీని నింపి విక్రయం వాహన తనిఖీల్లో ఇద్దరు పట్టుబడటంతో వెలుగులోకి వచ్చిన దందా రూ. 20 వేల విలువైన బాటిల్‌ను రూ. 10 వేలకే అమ్ముతున్నట్లు వెల్లడి ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నుంచి అసలు మద్యాన్ని తీసేసి, దాని స్థానంలో కల్తీ మద్యాన్ని నింపి అమ్ముతున్న ఓ ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ. 8 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 139 నింపిన మద్యం బాటిళ్లు, 136 ఖాళీ సీసాలు, ఒక స్కూటీ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ మార్గంలో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, స్కూటీపై వెళుతున్న దేశిని ప్రకాశ్‌ గౌడ్, గద్వాల భరత్‌లను ఆపారు. వారి వద్ద 15 ఖరీదైన బ్రాండ్ మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని పరిశీలించగా, సీసాల్లో కల్తీ మద్యం ఉన్నట్లు తేలింది. వారిని విచారించగా ప్రకాశ్‌ గౌడ్ తమ్ముడైన అరవింద్ ఇంట్లో ఈ దందా నడుస్తున్నట్లు ఒప్పుకున్నారు. అరవింద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఒడిశాకు చెందిన బుచ్చిదేవ్ మహంతి అనే వ్యక్తి ఈ కల్తీ బాటిళ్లను తయారు చేస్తున్నట్లు తెలిపాడు. వెంటనే మహంతి ఇంటిపై దాడి చేసిన పోలీసులు, అక్కడ 54 మద్యం బాటిళ్లను, ఈ దందాలో భాగస్వామి అయిన విక్రమ్ వద్ద మరో 24 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 వేలు పలికే మద్యం బాటిల్‌ను కల్తీ చేసి రూ. 10 వేలకే విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ దాడిలో పాల్గొన్న డీటీఎఫ్ బృందాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ, డిప్యూటీ కమిషనర్ దశరథ్ అభినందించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: