Monday, 27 July 2026 07:46:55 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*గుండెల్ని పిండేసే విషాదం.. ఇద్దరు చిన్నారుల హత్య, తండ్రి ఆత్మహత్యాయత్నం*

Date : 06 January 2026 11:15 AM Views : 239

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *గుండెల్ని పిండేసే విషాదం.. ఇద్దరు చిన్నారుల హత్య, తండ్రి ఆత్మహత్యాయత్నం* నారాయణపేట జిల్లా మరికల్ మండలం తేలేరు గ్రామంలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈ విషాద సంఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. శివరాం అనే వ్యక్తి తన పిల్లలు రిత్విక్, చైతన్యలు అనారోగ్యంతో ఉన్నారని చెప్పి అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని నమ్మించిన శివరాం, వారిని పొలాల వద్దకు తీసుకెళ్లి అక్కడే ఉరివేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం చిన్నారుల మృతదేహాలను సమీప కాలువలో పడేశాడు. ఈ ఘోరానికి పాల్పడిన అనంతరం శివరాం పురుగుల మందు తాగి, ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివరాంకు భార్యతో విడాకులు జరిగినట్లు సమాచారం. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ అమానవీయ ఘటనతో తేలేరు గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతి ప్రతి హృదయాన్ని కలిచివేస్తుండగా, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :