Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ మండలం జెడ్పీ.హెచ్.ఎస్ పునుకుల పాఠశాలలో సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సి పి ఎస్ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించిన అనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ..సి.పి.ఎస్ వల్ల తమ భవిష్యత్ భద్రతకు భంగం కలుగుతోందని,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీహరి,పాఠశాల సిబ్బంది సుజాత,అనురాధ,ప్రమీల, శ్రీపల్లవి,సునీత, బాల్య, రగ్యా,ప్రభాకర్రావు పాల్గొన్నారు
Admin
Mana Mahati News