Mana Mahati News - తెలంగాణ / వరంగల్ : ఏఐజెపిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియామకం మంచిర్యాల ప్రతినిధి నివాస్ న్యూస్ జనవరి 19: ################################################### అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏఐజెపిఎఫ్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొన్నేళ్లుగా జర్నలిజం రంగంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్ అందిస్తున్న సేవలు, జర్నలిస్టుల సమస్యలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, నిబద్ధతను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్ర కమిటీ తెలిపింది. ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఈ నియామకానికి ప్రధాన కారణంగా నిలిచిందని పేర్కొంది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు, అలాగే జర్నలిస్టులకు అండగా నిలిచేలా అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తన నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీ చైర్మన్ ఇసంపెల్లి వేణు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్, అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ సింగ్తో పాటు తోటి జర్నలిస్టు మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియామకం పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలకు మరింత బలమైన పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Mana Mahati News